దేశంలో జరుగుతున్నవి ఎన్నికలు కావని.. రెండు పరివార్ ల మధ్య యుద్ధమని తెలంగాణ సీఎం రేవంత్ అన్నారు. బెంగళూరు సెంట్రల్ లో కాంగ్రెస్ సభలో ఆయన మాట్లాడుతూ.. 'ఈవీఎం, ఈడీ, ఇన్ కం ట్యాక్స్, సీబీఐ, ఆదానీ, అంబానీ అంతా మోదీ పరివార్. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మా పరివార్. మోదీకి కర్ణాటక ప్రజల సంక్షేమం అవసరం లేదు' అని అన్నారు.