ప్రభుత్వ భూములు రక్షించాల్సిన బాధ్యత సీఎందే: తాటికొండ రాజయ్య

82చూసినవారు
ప్రభుత్వ భూములు రక్షించాల్సిన బాధ్యత సీఎందే: తాటికొండ రాజయ్య
TG: ప్రభుత్వ భూములు రక్షించాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదే అని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేర్కొన్నారు. ముఖ్యమంత్రే ప్రభుత్వ భూములు అమ్మాలనుకోవడం విడ్డూరం అంటూ రాజయ్య శనివారం విమర్శించారు. ఇనపరాతిగుట్టలపై కడియం శ్రీహరి కన్నేశారని రాజయ్య ఆరోపించారు. 28 ఎకరాల దేవనూరు భూమి కడియం బినామీ పేరుపై ఉందని ఆయన అన్నారు. కడియం శ్రీహరి ఆస్తులే ఆయన అక్రమాలకు సాక్ష్యాలని రాజయ్య వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్