HYD-పుప్పాలగూడ పరిసరాల్లో 450 ఎకరాల్లో IT నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు Dy. CM భట్టి విక్రమార్క ప్రకటించారు. 'ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్లు, రెవెన్యూ, స్పెషల్ పోలీస్ సొసైటీలకు కేటాయించిన ఈ భూమిలో ఐటీ హబ్ను చేస్తాం. వివిధ సొసైటీలకు 200 ఎకరాల భూ కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. పక్కనే ఉన్న మరో 250 ఎకరాల TGIIC భూములు కలిపి IT హబ్ ఏర్పాటు చేస్తాం. 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి’ అని చెప్పారు.