ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పరాజయం పాలైనా కాల్కాజీ స్థానం నుంచి విజయం సాధించిన అనంతరం ఆపద్ధర్మ సీఎం ఆతిశీ పార్టీ కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ స్పందిస్తూ ఆప్ ఘోర పరాజయం పొంది. సీనియర్ నాయకులంతా ఓడిపోయి కుమిలిపోతుంటే ఆతిశీ తనకేమీ పట్టనట్లు సంబరాలు చేసుకుంటున్నారని స్వాతి విమర్శించారు. ఇది సిగ్గు పడాల్సిన విషయమని ఆమె దుయ్యబట్టారు.