దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్లో 4 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. 252 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. ఇక 49వ ఓవర్ చివరి బంతికి భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఫోర్ కొట్టి జట్టును గెలిపించాడు. ఈ విన్నింగ్ షాట్ తర్వాత దేశ విదేశాల్లో భారత క్రికెట్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.