మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా మెరిసిన క్లాసిక్ మూవీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ మళ్లీ థియేటర్లలో సందడి చేస్తోంది. 1990లో విడుదలైన ఈ సినిమాను దాదాపు రూ.8 కోట్ల వ్యయంతో 3D, 8K ఫార్మాట్లోకి మారుస్తూ రీరిలీజ్ చేశారు. 35 ఏళ్ల తర్వాత బిగ్ స్క్రీన్పై శ్రీదేవిని చూసేందుకు అభిమానులు థియేటర్లకు భారీగా చేరుకుంటున్నారు. పాటలు, విజువల్స్కి ఫిదా అవుతూ సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.