బనకచర్లపై చర్చకు ప్రెస్క్లబ్కు రావాలంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. "అసెంబ్లీ పెట్టాలని ఎక్కడైనా ప్రతిపక్ష నేత కోరుతారు. తెలంగాణలో మాత్రం పరిస్థితి రివర్స్లో ఉంది. కేటీఆర్, హరీష్ సెకండ్ బెంచ్ లీడర్లు. బనకచర్లపై అసెంబ్లీకి రావాలని సీఎం సవాల్ చేశారు. ప్రజలు మిమ్మల్ని ఓట్లు వేసి గెలిపించారో అసెంబ్లీలో చర్చిస్తే అందరికీ తెలుస్తుంది." అని జగ్గారెడ్డి అన్నారు.