సంగారెడ్డి పట్టణంలోని సోమేశ్వరవాడలో బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్న మహిళ రాణమ్మను కాంగ్రెస్ MLA జగ్గారెడ్డి పరామర్శించారు. రాణమ్మ ట్రీట్మెంట్ కోసం రూ.4 లక్షల ఆర్థిక సహాయం అందించారు. 'క్యాన్సర్ అనేది ఎవ్వరికీ రావొద్దు. క్యాన్సర్ బాధితులది టెన్షన్లతో కూడిన జీవితం. క్యాన్సర్ ట్రీట్మెంట్ రూ.లక్షలతో కూడుకున్నది కావడంతో పేదలు ఆర్థికంగా చితికిపోతున్నారు. అందుకే సహకారం అందించాలని నిర్ణయించుకున్నా' అని తెలిపారు.