TG: ఆర్టీసీ బస్ పాస్ ధరల పెంపునకు నిరసనగా పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలతో MLC కవిత బస్ భవన్ ముట్టడించారు. బస్ పాస్ ధరలను పెంచి ప్రజలపై ప్రభుత్వం పెనుభారాన్ని మోపిందని.. విద్యార్థులు, చిరుద్యోగులపై తీవ్రంగా ఆర్థిక భారం పడుతుందని కవిత గళమెత్తారు. అనేక రూట్లల్లో విద్యార్థుల కోసం బస్సులు నడపడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని మండిపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కవితను పోలీసులు అరెస్ట్ చేశారు.