ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన బూట్ల రాజేందర్ ఇటీవల సౌదీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దుబాయ్ లో ఉంటున్న కొత్తపేట గ్రామానికి చెందిన బూరగడ్డ పెద్ద శ్రీనివాస్, బూరగడ్డ గడ్డ చిన్న శ్రీనివాస్, ఆడెపు శ్రీనివాస్, పార్వతి వెంకటేష్, కట్కూరి రవీందర్ లు సౌదీ మృతుని కుటుంబానికి 13000, స్థానిక శ్రీ సీతారామాంజనేయ ఆలయ కమిటీ ఛైర్మన్ గోనె శరత్ చంద్రా రెడ్డి 5000 రూపాయల ఆర్థిక సహాయం బుధవారం అందించారు.