భారత సైనికుల వీరోచిత పోరాటానికి సంఘీభావంగా పెగడపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం జాతీయ జెండాను పట్టుకొని పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ మాట్లాడుతూ శాంతి కోసం ఉగ్రవాదులను నిర్మూలించడానికి మన సైన్యం ప్రయత్నాలకు నైతికంగా మద్దతు ఇవ్వడానికి మనందరం ముందుండాలన్నారు.