ఎండపల్లి మండలం ముంజంపల్లిలో ఆదివారం ఎడ్లబండ్ల పోటీ నిర్వహించారు. వెల్గటూరు మండలం జగదేవుపేట గ్రామానికి చెందిన బచ్చల హిమాన్షు మొదటి బహుమతి, ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మాదాసు శంకయ్య ద్వితీయ బహుమతి, గొల్లపల్లి మండలం తిర్మలాపూరుకు చెందిన శ్రీ ఆంజనేయం తృతీయ బహుమతలు గెలిచారు. మొదటి బహుమతిగా 10 తులాల వెండి రెండవ బహుమతిగా, 5 తులాల వెండి మూడవ బహుమతిగా, 3 తులాల వెండి ఆలయ కమిటీ పంపిణీ చేశారు.