బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు గురువారం బుగ్గారం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు మెడవేణి శ్రీధర్, మంచే రాజేష్ ఆధ్వర్యంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దామెర రామ్ సుధాకర్ రావు పాల్గొని మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఈరోజు ప్రపంచ దేశాలు కూడా అనుసరిస్తున్నాయని అన్నారు.