జగిత్యాల: భారత రక్షక దళాలకు మద్దతుగా పాత్రికేయుల సంఘీభావ ర్యాలీ

72చూసినవారు
జగిత్యాల: భారత రక్షక దళాలకు మద్దతుగా పాత్రికేయుల సంఘీభావ ర్యాలీ
జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు 26 మంది అమాయకులను అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన అనంతరం మన భారత వీర జవాన్లు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను మట్టు పెట్టేందుకు చేస్తున్న వీరోచిత పోరాటానికి మద్దతుగా జగిత్యాల పాత్రికేయులు శనివారం సంఘీభావ ర్యాలీని నిర్వహించారు. జాతీయ జెండాలను చేతిలో పట్టుకొని జిల్లా కేంద్రంలోని తహసిల్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్