జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఐసీడీఎస్ మల్యాల ప్రాజెక్టు అధికారి వీర లక్ష్మి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ మాట - అంగన్వాడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.