శనివారం మెట్పల్లి బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో డిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల పట్టణ అధ్యక్షుడు బోడ్ల రమేష్ ఆధ్వర్యంలో టాపసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు పాల్గొని మాట్లాడుతూ ప్రధాని మోడీ నాయకత్వంలో డిల్లీలో విజయం సాధించిందని, బీజేపీ అభ్యర్థులను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.