జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఎర్దండి గ్రామంలో శుక్రవారం స్వయంభు వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు రోట్టె కిషన్ శర్మ, పవన్ శర్మల ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి అలయం వద్ద శాంతి యజ్ఞం, స్వామి వారికి పంచమృత అభిషేకాలు నిర్వహించారు. అనతరం ప్రత్యేక మండపంలో కళ్యాణం నిర్వహించారు.