జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ టి మోహన్ నేషనల్ హైవే డివైడర్లపై నాటిన మొక్కలకు నీరు పట్టడాన్ని పరిశీలించారు. మెట్ పల్లి మున్సిపల్ అంబేద్కర్ పార్కును పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలోనే నేషనల్ హైవే డివైడర్ పై నాటిన మొక్కలను డిజైన్ రూపంలో సర్వ సుందరంగా కటింగ్ చేస్తున్నందున వచ్చి పోయే ప్రజలు ఆకర్షితులై మొక్కలను పరిశీలిస్తున్నారు.