మార్చి 13న కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రంలో గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏరియాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత ఆధ్వర్యంలో డయాలసిస్ రోగులచే కేక్ కట్ చేయించి వారికి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం కిడ్నీ సంరక్షణ గురించి రోగులకు అవగాహన కల్పించారు.