ప్రజల దాహార్తిని తీర్చేందుకు కోరుట్ల పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు ఎడ్ల రాజశేఖర్ ముందుకు వచ్చారు. పట్టణ కేంద్రంలో ఫంకీ వరల్డ్ పెరుమీద చలివేంద్రాన్ని గురువారం ఏర్పాటు చేశారు. కాగా, గత 5 సంవత్సరాలుగా కోరుట్ల పట్టణ చుట్టుపక్కల ఉన్నటువంటి నిరు పేదలకు, కోరుట్ల పట్టణంలో తాత్కాలిక నివాసం ఏర్పర్చుకున్నటువంటి వలస కూలీలకు నిరాశ్రయ వృద్ధులకు వివిధ రకాలుగా సేవలు అందిస్తున్నారు.