కోరుట్ల నియోజకవర్గ మెట్టుపల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలోని పురాతనకొండ స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ జాతర రెండవ రోజు అయిన శుక్రవారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, మరో కాంగ్రెస్ నాయకుడు కొమిరెడ్డి విజయ్ ఆజాద్ తో కలిసి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.