అయిలాపూర్ లో ఆషాడ మాసంలో వచ్చే తొలి ఏకాదశీ సందర్బంగా ఆదివారం విష్ణు మూర్తిని పూజించటం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుందని నమ్మకం కావున శ్రీ అనంత పద్మానాభ స్వామి వారి దేవస్థానంలో ఆలయ అర్చకులు మునింధర్, గిరి ఆచార్యులు, స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుండి భక్తులు స్వామి వారిని దర్శించుకొని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు.