పాకిస్థాన్ సరిహద్దుల్లో అమరుడైన భారత జవాన్ లాన్స్ నాయక్ దినేశ్ కుమార్ పార్థివదేహం గురువారం స్వగ్రామానికి చేరుకుంది. ఆర్మీ వాహనంలో దినేశ్ కుమార్ పార్థివ దేహాన్ని హర్యానాలోని పల్వాల్కు తీసుకొచ్చారు. ఆ సమయంలో దినేశ్ కుమార్ను చూసేందుకు జనం భారీ సంఖ్యలో వచ్చారు. యువకులు బైకులపై ర్యాలీగా తరలివచ్చారు. ఆయనకు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.