అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉష ఈ నెల 21న భారత్ పర్యటనకు రానున్నారు. ఇదే రోజు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో సుంకాలు, ఆర్థిక వ్యవహారాలు, భౌగోళిక రాజకీయ అంశాలపై చర్చ జరగనుంది. వాన్స్ కార్యాలయం ఈ పర్యటనపై అధికారిక ప్రకటన విడుదల చేయగా, ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం దీనిని ధృవీకరించింది. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇది కీలక దశగా భావిస్తున్నారు.