దేశవ్యాప్తంగా గల IITలు, NITల్లో బీటెక్/బీఈ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్-2 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలను ఏప్రిల్ 1 నుంచి 8 వరకు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ పరీక్షకు హాజరయ్యేవారు ఈనెల 25 రాత్రి 9 గంటలలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్టీఏ వెల్లడించింది. ఇక రాత్రి 11.50 గంటలవరకు ఫీజును స్వీకరిస్తామని సంస్థ ప్రకటించింది.