ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్కు మద్దతుగా తుర్కియే వ్యవహరించడంపై భారత్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. దీంతో ‘బాయ్కాట్ తుర్కియే’ ఉద్యమం సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్న తరుణంలో తుర్కియేలోని మలట్యాలో ఉన్న ఇనొను యూనివర్సిటీతో విద్యాపరంగా కుదుర్చుకున్న మౌలిక ఒప్పందాన్ని (MoU) ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జేఎన్యూ సీనియర్ అధికారి పేర్కొన్నారు.