స్టీల్ అథారిటీ ఆఫ్
ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్ స్టీల్ ప్లాంట్లు/యూనిట్లు, గనుల్లో 249 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి
నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్-2024 స్కోరు సాధించినవారు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.60వేల– రూ.1,80,000 వరకు వేతనం ఉంటుంది. ఆసక్తి గల వారు ఈనెల 25 లోపు www.sail.co.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.