భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా దేశవ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాలు, వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ప్రస్తుత వైద్య సదుపాయాలపై పూర్తి సమాచారం అందించారు. కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షణ కొనసాగుతుందని వారు తెలిపారు. ఈ సమీక్షలో దేశంలోని అన్ని ఆసుపత్రులు, ఆరోగ్య సౌకర్యాల పనితీరు, అప్రమత్తతపై ఆయన ఆరా తీశారు.