ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్కుమార్ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిభవ్కుమార్ తీస్ హజారీ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం మంజూరు చేసుకున్నారు. బెయిల్ పిటిషన్పై విచారించిన కోర్టు తీర్పును రిజర్వు చేసింది. కాగా బిభవ్కుమార్ తనపై దాడి చేశాడని, కుర్చీలో కూర్చొన్న తనపై దాడి చేసి, కాలితో తన్నారని స్వాతి ఆరోపించారు.