కేఏపాల్ టర్కీ వెళ్తుండగా.. ఎయిర్పోర్టులో ఇండిగో సిబ్బంది అడ్డుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన టర్కీ వెళ్లి అక్కడి మహదీ అనే వ్యక్తితో కలిసి వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా కేఏపాల్ మాట్లాడుతూ.. పాకిస్తాన్కు టర్కీ ఆయుధాలను అమ్మిందని, కానీ అమెరికా పాకిస్తాన్కు ఎలాంటి ఆయుధాలను అమ్మలేదా అంటూ ప్రశ్నించారు. ట్రంప్ సౌదీ అరేబియాకు ఆయుధాలను అమ్మడానికే వెళ్లాడంటూ పేర్కొన్నారు. యుద్ధం ఆపాడానికే టర్కీ వచ్చానన్నారు.