రాజ్యసభకు మక్కల్ నీది మయ్యం(MNM) పార్టీ అధినేత, నటుడు కమల్హాసన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆరు స్థానాలకుగాను 4 స్థానాల్లో పోటీచేయనున్నట్లు ఇప్పటికే డీఎంకే వెల్లడించింది. అందులో ఒక స్థానాన్ని మిత్రపక్షమైన ఎంఎన్ఎంకు కేటాయించింది. ఆ స్థానానికి కమల్హాసన్ నామినేషన్ వేశారు. పోటీ ఎవరూ లేకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.