'భారతీయుడు'కు హీరోగా కమల్ ఫస్ట్ ఆప్షన్ కాదు. తొలుత 'పెరియ మనుషన్' పేరుతో రజనీకాంత్ కోసం డైరెక్టర్ శంకర్ కథ రాశారు. ఆయన వేరే ప్రాజెక్టుల్లో బిజీగా ఉండటంతో కొన్ని మార్పులతో 'భారతీయుడు'గా మార్చి అందులో రాజశేఖర్ను హీరోగా, కుమారుడిగా వెంకటేశ్/నాగార్జునను పెడదామనుకుంటే ఆ కాంబో వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత తమిళ నటులు కార్తీక్. సత్యరాజ్ను ట్రై చేసినా అదీ కుదరలేదు. చివరికి కమల్ గ్రీన్ సిగ్నలిచ్చారట.