కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న వై.ఎస్. బినూత్న బాస్కర్ త్రిబుల్ ఐటీకి ఎంపిక అయ్యింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శేఖర్, ఉపాధ్యాయ బృందం విద్యార్థినికి అభినందనలు తెలియజేశారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా కష్టపడి చదవాలని ఆయన అన్నారు.