బాన్సువాడ: ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ప్రారంభం

56చూసినవారు
బాన్సువాడ: ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ప్రారంభం
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో గల గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో 2025 26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించినట్లు ఆ సంస్థ రీజినల్ కోఆర్డినేటర్ ఎన్. గంగారాం నాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మెదక్, చేగుంట, నర్సాపూర్, ఎల్లారెడ్డి, హన్మాజీపేట/కోనాపూర్, ఇందల్వాయి బాలికల జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపీసీతో పాటు నర్సాపూర్ లోని కళాశాలలో సీఈసీ, హెచ్ఈసీ గ్రూప్ లలో ఖాళీలు ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్