బాన్సువాడ మండలంలోని పలు గ్రామాల్లో పోడు రైతులు పట్టాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అటవీ అధికారుల చర్యలతో ఆర్థికంగా చితికిపోతున్నారని కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ మండల ప్రధాన కార్యదర్శి సంజీవులు ఇన్చార్జ్ మంత్రి సీతక్కకు శనివారం వినతి పత్రం ఇచ్చారు. మానవతా దృక్పథంతో స్పందించి పోడు పట్టాలిప్పించాలని, భూ భారతి చట్టం కింద న్యాయం చేయాలని మంత్రిని కోరగా. ఆమె పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారన్నారు.