కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో శనివారం రూ. 37. 50 కోట్లతో నూతనంగా నిర్మించే 100 పడకల ఏరియా ఆసుపత్రి భవన నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు.
ఈ సందర్బంగా ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్టరుతో వివరాలు తెలుసుకొని నాణ్యత లోపం లేకుండా నిర్మించాలని సూచించారు.