బాన్సువాడ మండలంలో బోర్లం ప్రాథమిక పాఠశాలలో బుధవారం కృత్రిమ మేధస్సుతో పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. ప్రాథమిక దశ నుండి 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు కంప్యూటర్ లను ఉపయోగించి కృత్రిమ మేధస్సుతో పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా కోడింగ్, డికోడింగ్, గణితం, మరియు ఇంగ్లీష్ విషయాలను బోధిస్తున్నారు. కేవలం బోర్లం ప్రాథమిక పాఠశాలలో మాత్రమే ఈ అంశాలను బోధించడం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం అన్నారు.