జీపీ కార్మికుల సమస్యల పరిష్కారానికై ఈనెల 11న హైదరాబాద్ లో నిర్వహించే ధర్నా కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరుకావాలని ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్ పిలుపునిచ్చారు. ధర్నాకు సంబంధించిన కరపత్రాలను బుధవారం రుద్రూర్ మండల కేంద్రంలో ఆవిష్కరించారు. గ్రామ పంచాయతీ కార్మికులందరిని పర్మినెంట్ చేయాలని, పెండింగ్ లో ఉన్న వేతనాలు అందించాలని తదితర డిమాండ్లతో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.