కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో పత్రికా సంపాదకులపై అక్రమ కేసులు బనాయించడం హేయమైన చర్య అని జర్నలిస్టులు ఆరోపించారు. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో శనివారం నిరసన తెలిపారు. సాక్షి ప్రధాన సంపాదకుడిపై ఏపీ పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారని. అనుమతి లేకుండానే ఆయన ఇంట్లో సోదాలు చేయడం సరైంది కాదన్నారు.