జుక్కల్: బీజేపీ మండల అధ్యక్షునికి సన్మానం

62చూసినవారు
జుక్కల్: బీజేపీ మండల అధ్యక్షునికి సన్మానం
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మహమ్మద్ నగర్ మండల బీజేపీ అధ్యక్షులు దమనబోయిన శ్రీకాంత్ అధ్యక్షతన శుక్రవారం మండల కేంద్రంలో మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భవిష్యత్తులో పార్టీ అభివృద్ధి గురించి చర్చించారు. ఈ సందర్బంగా శ్రీకాంత్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ కొండా అనిల్, మాజీ అధ్యక్షులు రాజు, ప్రధాన కార్యదర్శులు జ్ఞానేశ్వర్, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్