కామారెడ్డి: గంజ్ పాఠశాల ముందస్తు బడిబాట

64చూసినవారు
కామారెడ్డి: గంజ్ పాఠశాల ముందస్తు బడిబాట
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని వడ్డెర కాలనీ, బతుకమ్మ కుంటలలో శనివారం గంజ్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింగం ఆధ్వర్యంలో ముందస్తు బడి బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా కాలనీలలో తిరిగి ప్రైవేటు పాఠశాలలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించి ప్రభుత్వ పాఠశాలకు పంపమని తల్లిదండ్రులకు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్