కోటగిరి మండల కేంద్రంలోని అమ్మ అనాధాశ్రమంలో చిన్నప్పటి నుండి ఉంటూ ఇటివల వెలువడ్డ కానిస్టేబుల్ ఫలితాల్లో కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించిన ఆశ్రమం విద్యార్థి లక్ష్మణ్ ను అభయస్థం ఫౌండేషన్ నిర్వాహకులు బర్ల మధుకర్ సతీష్ సమేతంగా శాలువాతో సన్మానించి పూలమాలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో బర్ల మధుకర్, స్వరూప, చిత్తరి నరేష్, అస్కుల విజయ్, ఇందూరి సాయిలు, ఎడ్డెడి గంగన్న, శ్రీకాంత్, సాయిబాబు, శివకుమార్ తదితరులున్నారు.