కోటగిరి: బైక్‌ను దగ్ధం చేసిన దుండగులు

75చూసినవారు
కోటగిరి: బైక్‌ను దగ్ధం చేసిన దుండగులు
ఇంటి ఎదుట పార్క్ చేసిన హోండా షైన్ 100 సీసీ బైక్ ను గుర్తు తెలియని దుండగులు నిప్పంటించి దగ్ధం చేసిన ఘటన శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కోటగిరి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో చోటుచేసుకుంది. ఎస్సీ కాలనీకి చెందిన పోతురాజు శ్రీనివాస్ అనే యువకుడు రోజు మాదిరిగానే యధావిధిగా ఇంటి ఎదుట తన బైక్ పార్క్ చేసి నిద్రపోయాడు. గుర్తుతెలియని వ్యక్తులు తన బైక్ కు నిప్పు పెట్టి దగ్ధం చేసినట్లు బాధితుడు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్