
ఐపీఎల్లో తొమ్మిదేళ్ల తరువాత కృనాల్ పాండ్య హాఫ్ సెంచరీ
ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆల్ రౌండర్ కృనాల్ పాండ్య హాఫ్ సెంచరీ సాధించారు. కృనాల్ పాండ్య 38 బంతుల్లో 50 పరుగులు పూర్తిచేసుకున్నారు. ఐపీఎల్ కెరీర్లో కృనాల్ పాండ్యకు ఇది రెండో అర్థశతకం. 9 ఏళ్ల తరువాత కృనాల్ హాఫ్ సెంచరీ చేశారు. దీంతో 16 ఓవర్లు ముగిసేసరికి RCB స్కోర్ 125/3గా ఉంది. క్రీజులో కృనాల్ (56), కోహ్లీ (49) ఉన్నారు.