నసురుల్లాబాద్: విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే

69చూసినవారు
నసురుల్లాబాద్: విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే
నసురుల్లాబాద్ మండలం మిర్జాపూర్ గ్రామానికి చెందిన కుసుమాంజలి 558, కైకాశ 563 మార్కులను బోర్లంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో పదవ తరగతిలో సాధించారు. ఈ సందర్భంగా గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ బాలరాజు లు విద్యార్థులను శాలువాతో సన్మానించి అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్