పోలీస్ స్టేషన్కు సమస్యల పరిష్కారానికి వచ్చే బాధితులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని ఎస్పీ సింధు శర్మ అన్నారు. బాన్సువాడ రూరల్ పోలీస్ స్టేషన్ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. కొత్త చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ కృష్ణకుమార్, సత్యనారాయణ గౌడ్, ఎస్సై లు, ఏఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.