యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని అందమైన జీవితాలను నాశనం చేసుకోవద్దని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల స్వామి అన్నారు. శుక్రవారం కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం యాంటీ నార్కోటిక్ బ్యూరో రూపొందించిన గోడ ప్రతులను ఆయన ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులచే మాదకద్రవ్యాలను నిర్మించే ప్రతిజ్ఞ చేయించి, ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ కోఆర్డినేటర్ రాజేష్, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.