కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ పట్టణంలోని ఆదర్శ పాఠశాలలో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రాజిరెడ్డి శనివారం తెలిపారు. జనవరి 6 నుండి ఫిబ్రవరి 28వ తేదీ వరకు అర్హత గల విద్యార్థులు ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.