బోధన్: రెండు బైకులు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు

71చూసినవారు
బోధన్: రెండు బైకులు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు
బోధన్ లో బుధవారం రాత్రి 12 గంటల 41 నిమిషాలకు మారుతీ మందిరం వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో రాకాసిపేట్ కి చెందిన ఎంబటి వెంకటికి కుడికాలు విరిగింది. స్థానికులు 108కు సమాచారం అందించగా, హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న బోధన్ 108 సిబ్బంది లక్ష్మణ్ మరియు జావేద్ లు ప్రథమ చికిత్స చేసి, నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. బోధన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్