బిచ్కుంద మండలం కందర్ పల్లి చౌరస్తా వద్ద ఎండుగంజాయి విక్రయిస్తున్న ఒకరిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ మోహన్ రెడ్డి తెలిపారు. దెగ్లూర్ కు చెందిన అర్జున్ భగత్ సింగ్ బండారి మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్నాడన్న సమాచారం మేరకు గురువారం పట్టుకున్నట్లు తెలిపారు. అతని వద్ద నుంచి 154 గ్రాముల గంజాయి, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని నిందితున్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.